ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-09-08T18:01:31+05:30

మండలంలోని నమిలిగొండ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి


స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని నమిలిగొండ గ్రామంలో లోలెవల్‌ కాజ్‌వే వద్ద వరద ఉధృతి తగ్గే వరకు సంబంధిత అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. మంగళవారం  ఆయన కాజ్‌వే వద్ద వరదను పరిశీలించారు. ఉధృతి తగ్గేవరకు వాహనాలను అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో కూలిపోయే స్థితిలో ఉన్నటువంటి ఇళ్లలో ఎవరూ నివాసం ఉండవద్దని అన్నారు. అత్యవసరమైతే  పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని, లేదంటే డయల్‌ 100 కాల్‌ చేస్తే వెంటనే పోలీసులు వచ్చి సహాయ చర్యలు చేపడుతారని అన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ గైక్వాడ్‌ రఘునాథ్‌ వైభవ్‌, ఘన్‌పూర్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శ్రీవాణి, సీఐ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్సైలు మహేందర్‌, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-08T18:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising