ఎస్టీ, ఎస్టీ, బీసీలందరూ ఈటలకే మద్దతు తెలపాలి: జాజుల
ABN, First Publish Date - 2021-10-29T08:45:58+05:30
హూజూరాబాద్ ఉప ఎన్నికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కే మద్దతు తెలిపాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. తెలంగాణ
కృష్ణానగర్ అక్టోబర్ 28 (ఆంధ్రజ్యోతి): హూజూరాబాద్ ఉప ఎన్నికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కే మద్దతు తెలిపాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. తెలంగాణ సమాజం కోసం ఆయన అలుపెరుగని పోరాటాలు చేసిన ఉద్యమ నాయకుడు ఈటల అని అభివర్ణించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ప్రజా సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ ఈటల రాజేందర్ను హూజూరాబాద్ ప్రజలు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈటల ఎదుగుదలను చూసి ఓర్వలేక కేసీఆర్.. ఆయన్ను పార్టీ నుండి బయటకు పంపించారని ఆరోపించారు. గిరిజన సంఘం రాష్ట్ర కన్వీనర్, ఓయూ జేఏసీ చైర్మన్ నెహ్రూనాయక్ మాట్లాడుతూ ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న ఈటలకు అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు.
Updated Date - 2021-10-29T08:45:58+05:30 IST