పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్
ABN, First Publish Date - 2021-03-15T01:41:41+05:30
జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. పోలింగ్ రోజు బీజేపీపై పవన్ చేసిన
హైదరాబాద్: జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. పోలింగ్ రోజు బీజేపీపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను వ్యతిరేకించిన పవన్.. ఇప్పుడు సమర్థించటం దేనికి సంకేతం? అని బండి సంజయ్ ప్రశ్నించారు. పవన్కు ఏదైనా ఇబ్బంది ఉంటే కేంద్ర నాయకత్వం లేదా తన దృష్టికి తీసుకురావాల్సిందని చెప్పారు. జనసేనతో పొత్తుపై పవన్తో ఎప్పుడు చర్చలు జరపలేదని సంజయ్ తెలిపారు.
తెలంగాణ బీజేపీపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము కేంద్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర శాఖ తమను అవమానించిందని మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడారు. జనసేనను చులకన చేసేలా బీజేపీ మాట్లాడిందని ఆరోపించారు. బీజేపీ తమను పదే పదే అవమానిస్తోందని మండిపడ్డారు. అందుకే తాము తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతిస్తున్నామని వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడని పవన్ కొనియాడారు.
Updated Date - 2021-03-15T01:41:41+05:30 IST