ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ అడ్డదారుల్లో గెలవాలని చూస్తోంది: బండి సంజయ్

ABN, First Publish Date - 2021-03-06T20:18:28+05:30

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్ కర్నూల్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిమ్మికులతో, అడ్డదారుల్లో గెలవాలని చూస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పీవీ నర్సింహారావు ఫొటో పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పీవీ నర్సింహారావు ఘాట్‌ను కూల్చేస్తామన్న పార్టీ తరపున ఎలా పోటీ చేస్తారని వాణిదేవిని ప్రశ్నించారు. సమాజానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవకుంటే ముఖ్యమంత్రి‌కి అహంకారం తలకెక్కి ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉపాధ్యాయులు, ఉద్యోగస్తుల పేరు చెప్పుకుని మంత్రి పదవి పొందారని.. నేడు వారినే బెదిరించి ఓట్లు రాబట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. సొంత మనుషుల బదిలీలు, ప్రమోషన్ల కోసం జీవోలు మార్చిన సంగతి అందరికీ తెలుసు అని.. ముందు వాటిపై దృష్టి పెట్టాలని ఆ తర్వాత తమ గురించి మాట్లాడాలని బండి సంజయ్ హితవు పలికారు.

Updated Date - 2021-03-06T20:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising