అలయ్ బలయ్.. ముఖ్య అతిథిగా వెంకయ్య: బండారు విజయలక్ష్మీ
ABN, First Publish Date - 2021-10-14T20:44:26+05:30
అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతిని ప్రతిభిస్తోందని బండారు విజయలక్ష్మీ అన్నారు.
హైదరాబాద్: అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతిని ప్రతిభిస్తోందని బండారు విజయలక్ష్మీ అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఆదివారం (17వ తేదీ) జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొంటారన్నారు. తెలంగాణ, ఏపీ, హర్యానా గవర్నర్లు కూడా అలయ్ బలయ్లో పాల్గొంటారన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖమంత్రులను కూడా ఆహ్వానించామన్నారు. కోవిడ్ సమయంలో సేవచేసిన వారిని అలయ్ బలయ్ వేదికపై ఘనంగా సత్కరిస్తామని బండారు విజయలక్ష్మీ పేర్కొన్నారు.
Updated Date - 2021-10-14T20:44:26+05:30 IST