డీఎస్పీ ఆఫీస్లో మహిళా రైతు ఆత్మహత్యా యత్నం
ABN, First Publish Date - 2021-06-29T22:00:04+05:30
పట్టణంలోని డీఎస్పీ ఆఫీస్లో పురుగుల మందు తాగి మహిళా రైతు దండెంపల్లి కవిత ఆత్మహత్యా
నల్లగొండ: పట్టణంలోని డీఎస్పీ ఆఫీస్లో పురుగుల మందు తాగి మహిళా రైతు దండెంపల్లి కవిత ఆత్మహత్యా యత్నం చేసింది. ఆత్మహత్యా యత్నాన్ని పోలీసులు అడ్డుకుని కవితను ఆసుపత్రికి తరలించారు. కవిత పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోగల కతాల్గూడలోని భూమి విషయంలో గత మూడు నెలలుగా భాగస్థుల మధ్య వివాదం నడుస్తోంది. వారి బంధువులు తమ భూమిని అమ్ముకుని, కవితకు చెందిన భూమిపైకి రావడంతో ఆర్డీవో, ఎమ్మార్వో దృష్టికి బాధితురాలు కవిత తీసుకువెళ్లింది. సర్వే చేసే సమయంలో అధికారుల సూచనలతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆ భూమి అవతలి వ్యక్తులది అంటూ భూమి నుంచి వెళ్లిపోవాలని కవితను ఇబ్బంది పెట్టారు. దీంతో డీఎస్పీ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి కవిత ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
Updated Date - 2021-06-29T22:00:04+05:30 IST