ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోరు పారేసుకుంటే నాలుక చీరుస్తా: ఉదయభాను

ABN, First Publish Date - 2021-12-02T22:15:49+05:30

వైసీపీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: వైసీపీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసుపై ఏపీ ప్రభుత్వ విప్‌ ఉదయభాను తీవ్ర ఆగ్రహం చేశారు. వాసుని ఆయన హెచ్చరించారు. మరోసారి వైసీపీ సహా కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబుపై నోరు పారేసుకుంటే నాలుక చీరుస్తానని ఆయన హెచ్చరించారు. వాసుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. మధిరలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఉదయభాను పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.   


ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులను హత్య చేయడానికి ముందుకొస్తే తాను రూ. 50 లక్షలు ఇస్తానని వాసు ప్రకటించిన విషయం తెలిసిందే. కమ్మ కులం నుంచి నాని, వంశీలను వెలి వేయాలని తీర్మానించాలన్నారు. అలాగే అంబటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

కమ్మ కులంలో పుట్టి ఎదిగిన కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు అంబటి రాంబాబులను భౌతికంగా నిర్మూలించడానికి తన వంతుగా రూ.50 లక్షలు ఇస్తానని కమ్మ వనసమారాధానలో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. 




Updated Date - 2021-12-02T22:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising