జడ్పీ సర్వసభ్య సమావేశం తేదీ మార్పు
ABN, First Publish Date - 2021-03-07T04:38:10+05:30
ఆదిలాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించే తేదీని ఈ నెల 13 నుంచి 21కి మార్చినట్లు జడ్పీ సీఈవో కిషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆదిలాబాద్టౌన్, మార్చి6: ఆదిలాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించే తేదీని ఈ నెల 13 నుంచి 21కి మార్చినట్లు జడ్పీ సీఈవో కిషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు ఈ సమావేశం జరుగుతుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారన్నా రు. సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయా సంక్షేమ అభివృద్ధి పథకాల, కార్యక్రమాల పూర్తి వివరాలు, మంజూరు చేసిన బడ్జెట్ వివరాలతో అధికారులు హాజరు కావాలన్నారు. గైర్హాజరైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - 2021-03-07T04:38:10+05:30 IST