లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు
ABN, First Publish Date - 2021-06-23T05:26:23+05:30
మండలంలోని కల్లెడ గ్రామపంచాయతీ పరిధిలోగల దోస్త్నగర్ అరణ్యప్రాంతంలో గుట్టపై కొలువుదీరిన నల్గొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేకపూజలు నిర్వహించారు.
కడెం, జూన్ 22 : మండలంలోని కల్లెడ గ్రామపంచాయతీ పరిధిలోగల దోస్త్నగర్ అరణ్యప్రాంతంలో గుట్టపై కొలువుదీరిన నల్గొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. ప్రతీ సంవ త్సరం వర్షాకాలంలో జూన్ నెలలో కల్లెడ గ్రామస్థులు నరసింహస్వామికి పూజ లు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు. గ్రామంలో వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలను చల్లగా చూడాలని, పాడిపంట లను కాపాడాలని స్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-23T05:26:23+05:30 IST