తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
ABN, First Publish Date - 2021-01-13T04:30:55+05:30
తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో కాగజ్నగర్ పట్టణంలోని స్థానిక టెంపుల్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను మంగళవారం కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు.
కాగజ్నగర్ టౌన్, జనవరి12: తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో కాగజ్నగర్ పట్టణంలోని స్థానిక టెంపుల్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను మంగళవారం కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ యేట జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో 43 మంది మహిళలు పాల్గొనగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీష్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పర్శ చంద్రశేఖర్, జాగృతి జిల్లా మహిళ కన్వీనర్ వినోద, ప్రతినిధులు రవి, దామోదర్, లక్ష్మయ్య, మల్లేశ్వరి, ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-13T04:30:55+05:30 IST