హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2021-02-19T03:49:07+05:30
సివిల్ సప్లయీస్ హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు.
-ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్
ఆసిఫాబాద్, ఫిబ్రవరి18: సివిల్ సప్లయీస్ హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆసిఫాబాద్ పట్టణంలోని సివిల్ సప్లయీస్ గోదాం ఎదుట హమాలీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హమాలీలకు ఇచ్చిన హామీ లను అమలు చేయడంలో విఫలమైందన్నారు. హమాలీ కార్మికులకు పెరిగిన రేట్ల జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్, హేమాజీ, దివాకర్, తరుణ్, శ్రీనివాస్, సురుఏష్, తిరుపతి, మోహన్, తుకారాం పాల్గొన్నారు.
Updated Date - 2021-02-19T03:49:07+05:30 IST