ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ బైక్ ఢీ

ABN, First Publish Date - 2021-01-21T04:10:24+05:30

కన్నెపల్లి మండలంలోని బుయ్యారం ఎక్స్‌రోడ్డు వద్ద లారీ బైక్‌ను ఢీకొన్న సంఘ టనలో నాయకునిపేట గ్రామపంచాయతీలోని కుర్మ గూడెంకు చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందా రు.

సంఘటన జరిగిన ప్రదేశంలో పడి ఉన్న మృతదేహాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నెపల్లి, జనవరి 20 : కన్నెపల్లి మండలంలోని బుయ్యారం ఎక్స్‌రోడ్డు వద్ద లారీ బైక్‌ను ఢీకొన్న సంఘ టనలో నాయకునిపేట గ్రామపంచాయతీలోని కుర్మ గూడెంకు చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందా రు. కన్నెపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి భూమి రిజిస్ర్టేషన్‌ నిమిత్తం బుధవారం బైరి పెర్మయ్య(50), అతని భార్య బైరి కళ (48), వదిన బైరి మల్లక్క(55)లతో కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చారు. పనులు ముగించుకుని కుర్మగూడెంకు వెళ్తున్న సమయంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో మెట్‌పల్లి నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి ద్విచక్ర వాహ నాన్ని ఢీకొనడంతో ముగ్గురు కిందపడ్డారు. దీంతో లారీ టైర్లు కళ, మల్లక్కల తలలపై వెళ్ళడంతో నుజ్జునుజ్జయ్యాయి. పెర్మయ్య కాలుపై నుంచి లారీ టైర్లు వెళ్లడంతో కాలు విరిగి మృతిచెందాడు. స్థానికులు సమాచారం అందించడంతో సీఐ బాబురావు, ఎస్‌ఐ ప్రశాంత్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకు న్నారు. కాగా సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ లారీని ఆపకుండా కిలోమీటరు దూరం వెళ్లి లారీని విడిచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ముగ్గురు ఒకే కుటుం బానికి చెందిన వారు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడు పెర్మయ్యకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉండగా, బైరి మల్లక్కకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. 

Updated Date - 2021-01-21T04:10:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising