అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ల పట్టివేత
ABN, First Publish Date - 2021-01-21T06:31:09+05:30
మండలంలోని గోదావరి నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను బుధవారం రోజున కొత్తూర్ ఎక్స్ రోడ్ వద్ద మామడ ఎస్సై కే. వినయ్కుమార్ పట్టుకున్నారు.
మామడ, జనవరి 20 : మండలంలోని గోదావరి నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను బుధవారం రోజున కొత్తూర్ ఎక్స్ రోడ్ వద్ద మామడ ఎస్సై కే. వినయ్కుమార్ పట్టుకున్నారు. తగు చర్యల నిమిత్తం తహసీల్దార్ శ్రీకాంత్కు అప్పగించారు. ఈ సంద ర్భంగా ఎస్సై వినయ్కుమార్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుకను తర లిస్తే చర్యలు తప్పవని చట్టపరంగా వాహనాలు సీజ్ చేస్తామని తెలి పారు. భూగర్భ జలాలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది భీమన్న, రవి పాల్గొన్నారు.
Updated Date - 2021-01-21T06:31:09+05:30 IST