దళిత శక్తి ఆధ్వర్యంలో ర్యాలీ
ABN, First Publish Date - 2021-01-24T05:57:17+05:30
ఈ నెల 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిపే కార్యక్రమాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని తప్పకుండా ఏర్పాటు చేయాలని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా అధ్యక్షులు గణేష్ మహరాజ్ డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ అర్బన్, జనవరి 23: ఈ నెల 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిపే కార్యక్రమాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని తప్పకుండా ఏర్పాటు చేయాలని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా అధ్యక్షులు గణేష్ మహరాజ్ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను పాలకులు విస్మరిస్తున్నారని, ఇది హేయమైన చర్య అని ఆయన విమర్శించా రు. జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో అంబేద్కర్ చిత్రపటాన్ని సైతం ఏర్పాటు చేసి పూజించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో శనివారం దళిత శక్తి ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అంబేద్కర్ చౌక్ నుంచి ప్రారంభమై జిల్లా కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం కొద్ది సేపు బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్కు వెళ్లి కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ఇందులో దళిత శక్తి నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-24T05:57:17+05:30 IST