సమస్యలను సకాలంలో పరిష్కరించాలి
ABN, First Publish Date - 2021-12-16T04:03:39+05:30
మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని ఎంపీపీ మల్లికార్జున్యాదవ్, జడ్పీ టీసీ అరిగెల నాగేశ్వర్రావు పేర్కొన్నారు.
- మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు 15: మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని ఎంపీపీ మల్లికార్జున్యాదవ్, జడ్పీ టీసీ అరిగెల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మల్లికార్జున్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ఈ సమా వేశం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సంద ర్భంగా సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తీసు కువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా చూడాల న్నారు. గ్రామాల్లో ప్రారంభించే అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి పంటను వేయకుండా ఆరుతడిపంటలను పండించేలా రైతు లకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశిం చారు. రైతుబంధు పథకం మండలంలోని కొంతమం దికి అందడం లేదని, వారిని గుర్తించి అందేలా చూడా లని సూచించారు. మండలంలోని ప్రతిగ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయాల న్నారు. మండలంలోని మారుమూల ప్రాంతాలకు కొత్త రేషన్ షాపులు మంజూరుచేసి సరుకులు అందజేయా లన్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను సరి చేయాలని తదితర సమస్యలను సర్పంచ్లు, ఎంపీటీసీలు సభదృష్టికి తీసుకువచ్చారు. సమావే శంలో ఎంపీడీవో శశికళ, సింగిల్ విండోచైర్మన్ అలీబీన్ అహ్మద్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-16T04:03:39+05:30 IST