నాందేవ్ కాంబ్లే అంత్యక్రియలు పూర్తి
ABN, First Publish Date - 2021-07-30T06:01:19+05:30
గుండెపోటుతో బుధవారం మృతిచెందిన ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ అంత్యక్రియలను గురువారం ఆయన స్వగ్రామం గుంజాలలో కుటుంబ సభ్యులు నిర్వహించారు.
పాల్గొన్న మంత్రి అల్లోల, పలువురు ప్రముఖులు
నార్నూర్, జూలై 29: గుండెపోటుతో బుధవారం మృతిచెందిన ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ అంత్యక్రియలను గురువారం ఆయన స్వగ్రామం గుంజాలలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హాజరై నాందేవ్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ ఎంపీ గోడాం నగేష్, ఖమ్మం డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్, ఎంపీపీ కనక మోతుబాయి, నార్నూర్ సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్, ఎంపీటీసీ పరమేశ్వర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
సమాజం గొప్ప నాయకుడిని కోల్పోయింది..
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
సమాజం గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆయన సమాజానికి చేసిన సేవలు మర్చిపోలేనివని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ మృతి వార్త తెలిసిన వెంటనే గురువారం ఆయన నాందేవ్ స్వగ్రామమైన గుంజాలలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ నాయకులు బాలాజీ కాంబ్లే, లాజర్ బిరుదల, కుడాల స్వామి, అరికెల అశోక్, రాజన్నమోతే ఉన్నారు.
Updated Date - 2021-07-30T06:01:19+05:30 IST