ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎల్‌సీ ఉదారత.. వృద్ధ దంపతులకు ఇల్లు నిర్మాణం

ABN, First Publish Date - 2021-07-25T04:12:41+05:30

మండల కేంద్రంలోని రాగం మల్లయ్య-పోసక్క నిరుపేద వృద్ధ దంపతులకు ఉమ్మడి జిల్లా ఎంఎల్‌సీ పురాణం సతీష్‌కుమార్‌ ఇల్లు నిర్మిం చి ఇచ్చారు. వీరి ఇల్లు శిథిలం కావడంతో ఎంఎల్‌సీ గమనించారు. మూడు నెల ల క్రితం ఇల్లును తొలగింపజేసి కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు.

వృద్ధ దంపతులతో ఇంటి ప్రవేశం చేయిస్తున్న ఎంఎల్‌సీ సతీష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటపల్లి, జూలై 24 : మండల కేంద్రంలోని రాగం మల్లయ్య-పోసక్క నిరుపేద వృద్ధ దంపతులకు ఉమ్మడి జిల్లా ఎంఎల్‌సీ పురాణం సతీష్‌కుమార్‌ ఇల్లు నిర్మిం చి ఇచ్చారు. వీరి ఇల్లు శిథిలం కావడంతో ఎంఎల్‌సీ గమనించారు. మూడు నెల ల క్రితం ఇల్లును తొలగింపజేసి కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. రూ. 5 లక్షల సొంత నిధులతో నిర్మాణం పూర్తి చేసి శనివారం మంత్రి కేటీఆర్‌ జన్మది నం సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా ఇల్లు అందించారు. గ్రామస్తులు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య దంపతులతో గృహ ప్రవేశం చేయించారు. ఎంఎల్‌సీ మాట్లాడుతూ కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఇల్లు నిర్మించి అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కోటపల్లి, చెన్నూరు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-25T04:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising