ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా కృషి చేయండి

ABN, First Publish Date - 2021-04-16T07:22:23+05:30

ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మినిమన్‌ సర్వీసు లే కుండా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని రిటైర్డ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే రేఖానాయక్‌కు వినతిపత్రం అందజేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే రేఖానాయక్‌కు రిటైర్డ్‌ ఉద్యోగుల వినతి

ఖానాపూర్‌, ఏప్రిల్‌ 15 : ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మినిమన్‌ సర్వీసు లే కుండా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని రిటైర్డ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాము 2020 జూలై మాసంలో ఉద్యోగ విరమణ పొం దామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభలో చేసిన పీఆర్‌సీ ప్రకటనలో ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 61 ఏళ్లకు పెంపొందించడం తో పాటు ఈ ఏడాది మార్చి నుండి అది వర్తిస్తుందని ప్రకటించారన్నారు. దీంతో తమకు ఆ వెసులుబాటు వర్తించక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. తమను కూడా ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా కృషి చేసి తమ కుటుంబాలకు అండగా నిలువాలని రిటైర్డ్‌ ఉద్యోగులు ఎమ్మెల్యే రేఖానాయక్‌ను కోరా రు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు వెంకట్రమణ, ఐతం శంకర్‌, రాజేశ్వర్‌, నర్సింగ్‌రావు, లచ్చన్న, రాములు, రవికుమార్‌ తదితరులున్నారు. 


Updated Date - 2021-04-16T07:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising