ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత గిరిజన దండోరాను అడ్డుకుంటాం

ABN, First Publish Date - 2021-08-03T05:01:19+05:30

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి స్థూపం వద్ద నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఉట్నూర్‌ మండల ఆదివాసీ సర్పంచ్‌ల సంఘం ప్రకటించింది.

ఉట్నూర్‌లో మాట్లాడుతున్న ఆదివాసీ సర్పంచ్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, ఆగస్టు 2 : కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి స్థూపం వద్ద నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఉట్నూర్‌ మండల ఆదివాసీ సర్పంచ్‌ల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉట్నూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షురాలు పెందూర్‌ కళావతి బండు, ప్రధాన కార్యదర్శి జుగదిరావులు మాట్లాడారు. ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దళిత గిరిజన దండోరాను ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. ఆదివాసీ దినోత్సవం రోజున ఇంద్రవెల్లి స్థూపం వద్ద కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే కార్యక్రమానికి లంబాడాలు ఎలా వస్తారని ప్రశ్నించారు. 9న కాకుండా ఇతర రోజుల్లో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆదివాసీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T05:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising