కొమురంభీం: పులి కోసం కొనసాగుతున్న ఆపరేషన్
ABN, First Publish Date - 2021-01-14T15:41:23+05:30
జిల్లాలో పులికోసం అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది.
కొమురంభీం: జిల్లాలో పులికోసం అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. బెజ్జూరు మండలం కంది భీమన్న అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు మకాం వేశారు. అయితే ఇప్పటి వరకు పులి బోన్ల వైపు రాని పరిస్థితి నెలకొంది. పులిని బంధించేందుకు రెస్క్యూ టీమ్, మత్తు మందు నిపుణులు, షూటర్లు రంగంలోకి దిగారు. పులి కనిపిస్తే మంచెపై నుంచి మత్తు ఇంజక్షన్ వేసేలా ఏర్పాటు చేశారు. సులుగుపల్లి వద్ద పులి ఆనవాళ్ళు కనిపించినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆపరేషన్లో టైగర్ ట్రాకర్స్, మహారాష్ట్ర నిపుణులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-14T15:41:23+05:30 IST