గోదావరిలో అర్ధనగ్న నిరసన
ABN, First Publish Date - 2021-02-24T06:16:41+05:30
మామడ శివారులో చేపట్టిన సదర్మాట్ బ్యారేజీ భూ నిర్వాసితులు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
పరిహారం ఇప్పించాలని భూనిర్వాసితుల డిమాండ్
మామడ, ఫిబ్రవరి 23 : మామడ శివారులో చేపట్టిన సదర్మాట్ బ్యారేజీ భూ నిర్వాసితులు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గోదావరి నదిలో గంటలపాటు అర్ధనగ్నంగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. అనంతరం పలువురు భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. తమకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే వరకూ ప్రతీరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామన్నారు. కనీసం ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన పరిహారాన్ని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
Updated Date - 2021-02-24T06:16:41+05:30 IST