రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణ
ABN, First Publish Date - 2021-01-21T04:12:15+05:30
అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరం కోసం బుధవారం హైటెక్ సిటీలోని హరిహర క్షేత్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిధి సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఏసీసీ, జనవరి 20 : అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరం కోసం బుధవారం హైటెక్ సిటీలోని హరిహర క్షేత్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిధి సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ లక్షా 116, శ్రీనివాస లక్ష్మి కన్స్ట్రక్షన్స్ మేనేజిం గ్ పార్ట్నర్ రవీందర్రావు లక్షా 12 వేల 345 చెక్కును అందజేశారు. గోలి రాము, తిరుప తి, చందా కిరణ్, రాజయ్య, హనుమంత రావు, బియ్యాల సతీష్ రావు, పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టారు.
జన్నారం: భవ్య రామ నామ మందిర నిర్మా ణానికి బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు గోలి చందు, నాగే శ్వర్లు మాట్లాడుతూ అయోధ్యలో రామమంది రం కోసం విరాళాలను ఇవ్వాలన్నారు. కొండపల్లి మహేష్, రమేష్గౌడ్, నరేందర్ పాల్గొన్నారు.
నస్పూర్: పట్టణం లోని గోదావరి, నాగార్జు న కాలనీల్లో బుధవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో మండల శ్రీరామ భక్త కమిటీ అయోధ్య రామ మందిర నిధి సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. బోయిని రవి కుమార్, కుమారస్వా మి, రాకేశ్ పాల్గొన్నారు.
కన్నెపల్లి : మండల కేంద్రంలో శ్రీరామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరామభక్త కమిటీ సభ్యులు విరాళాలు సేకరించారు. ల్, వినోద్, రాకేష్, రవి, ప్రజలు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-21T04:12:15+05:30 IST