ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలి
ABN, First Publish Date - 2021-09-17T04:47:49+05:30
అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు అన్నారు. గురువారం మండలం లోని చిర్రకుంటలో కొవిడ్ టీకాకేంద్రాన్ని ప్రారంభిం చారు.
ఆసిఫాబాద్రూరల్, సెప్టెంబరు 16: అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు అన్నారు. గురువారం మండలం లోని చిర్రకుంటలో కొవిడ్ టీకాకేంద్రాన్ని ప్రారంభిం చారు. ఎంపీపీమల్లికార్జున్, ఎంపీవో ప్రసాద్, వైద్యుడు సత్యనారాయణ, సర్పంచ్ పార్వతిబాయి పాల్గొన్నారు.
రెబ్బెన: మండలకేంద్రంతోపాటు నంబాల గ్రామ పంచాయతీలో గురువారం వందశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ ఆనంద్ ప్రారంభించారు.
కెరమెరి: కొవిడ్ టీకా వేయించుకోవాలని ఎంపీపీ మోతిరాం, జడ్పీటీసీ ధ్రుపతాబాయి అన్నారు. గురు వారం పీహెచ్సీలో వందశాతం కొవిడ్ టీకా కార్యక్ర మాన్ని ప్రారంభించారు.
కాగజ్నగర్: కాగజ్నగర్ మున్సిపాల్టీలో వార్డుల వారీగా గురువారం కొవిడ్ వ్యాక్సిన్వేశారు. అంగన్వాడీ తదితర సెంటర్లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపట్టారు.
దహెగాం: అర్హులందరూ కొవిడ్వ్యాక్సిన్ వేయించు కోవాలని ఇన్చార్జి వైద్యాధికారి చంద్రకిరణ్ అన్నారు. మండలంలోని ఆరుసబ్సెంటర్లలో 110మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.
కౌటాల:మండలంలో వందశాతం కొవిడ్ వ్యాక్సినేష న్ను పూర్తిచేయాలని ఎంపీపీవిశ్వనాథ్ అన్నారు. గురువారం ముత్తంపేట, మొగడ్దడ్ సబ్సెంటర్లలో వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.
Updated Date - 2021-09-17T04:47:49+05:30 IST