ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబుల్‌బెడ్‌రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-12-09T04:24:33+05:30

మందమర్రి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి అందుబా టులోకి తేవాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ సూచించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలిస్తున్న విప్‌ బాల్క సుమన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
మందమర్రిటౌన్‌, డిసెంబరు 8: మందమర్రి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి అందుబా టులోకి తేవాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ సూచించారు.  పట్ట ణంలోని పాలచెట్టు తహసీల్దార్‌ కార్యాలయం వెనక నిర్మిస్తున్న 560 డబుల్‌బెడ్‌రూం గృహాల పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఆయన మాట్లాడుతూ 80 శాతం పనులు పూర్తయ్యా యని చెప్పారు. మిగితా పనులను త్వరగా పూర్తి  చేయాలన్నారు. అర్హులైన నిరుపేదలకు గృహాలను మంజూరు చేయనున్నామని చె ప్పారు. ఈ గృహాలతో పట్టణానికి కొత్త శోభ వస్తుందన్నారు. ఈ గృహా పరిసర ప్రాంతాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. విప్‌ వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు మేడిపల్లి సంపత్‌, వెంకటేశ్వర్లు, గుడ్ల రమేష్‌, బోరిగం వెంకటేష్‌, బట్టు రాజ్‌కుమార్‌, కనకం రవీందర్‌, రాంవేణు, ముస్తాఫా తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-12-09T04:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising