ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డి-28 ఎడమ కాలువకు గండ్లు చేసిన దుండగులు

ABN, First Publish Date - 2021-04-13T05:30:00+05:30

సరస్వతి కెనాల్‌ 28 పల్కెరువాగు ఎడమకాలువ 2వ కిలో మీటర్‌ వద్ద మందపల్లి గ్రామస్థులు పగలగొట్టారని పెంబి రైతులు అన్నారు.

కాలువ గండ్లను చూపిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతుల డిమాండ్‌

పెంబి, ఏప్రిల్‌ 13 : సరస్వతి కెనాల్‌ 28 పల్కెరువాగు ఎడమకాలువ 2వ కిలో మీటర్‌ వద్ద మందపల్లి గ్రామస్థులు పగలగొట్టారని పెంబి రైతులు అన్నారు. వెంటనే అధికారులు డి-28 కెనాల్‌ ద్వారా పెంబి ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ రోజు కూడా ఆయకట్టు నీరు అందినట్లు దాఖలాలు లేవని, పెంబి రైతులుకాలువ వెంట ఎన్నిసార్లు గండ్లను పూడుస్తూ వచ్చినప్పటికీ తిరిగి వెను వెంటనే గండ్లను తెరిచి నీటిని వృధాగా వాగులోకి వదులుతున్నారని, దీని మూలంగా పెంబి రైతులు పంటపొలాలకు నీరు అందక, భూములు బీడుగా మారుతున్నాయి. పశువులకు నీరుసమస్య తీవ్రంగా ఉందని, అధికారులు, నాయ కులు ఎన్నిసార్లు విన్నవించినా తగినచర్యలు తీసుకోవడం లేదని, కనీసం ఇప్పటి కైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువకు గండ్లు ఏర్పరిచిన వారిపై తగిన చర్యలు తీసుకొని కాలువకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని పెంబి గ్రామరైతులు కోరుతున్నారు. రైతులు తులాల రాజలింగు, పాకాల భూమా రెడ్డి, కన్నె మల్లేష్‌, జనార్ధన్‌, కృష్ణారెడ్డి, నారాయణగౌడ్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-04-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising