ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు సమస్య పరిష్కారం అయ్యేదాక సీపీఐ పోరాటం చేస్తుంది: చాడ

ABN, First Publish Date - 2021-08-04T22:16:54+05:30

పోడు సమస్య పరిష్కారం అయ్యేదాక సీపీఐ పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమురం భీం: పోడు సమస్య పరిష్కారం అయ్యేదాక సీపీఐ పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. పోడు సాగుదారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నుంచి సీపీఐ పోడుయాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఒక్క ఎకరా పోడు భూమికి కూడా సీఎం కేసీఆర్ పట్టా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కుర్చీ వేసుకుని పట్టాలు ఇస్తానని ఎన్నో సార్లు చెప్పారని, ఎప్పుడు కుర్చీ వేసుకుని ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాలు ఇవ్వక పోగా పోడు రైతులపై పీడీ యాక్టులు, క్రిమినల్ కేసులు పెడుతున్నారని తెలిపారు. హరితహారం పేరిట సాగులో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారని, పోడు భూముల విషయంలో అటవీ, పోలీసు శాఖల తీరు ఆక్షేపనీయమన్నారు. తక్షణమే రైతులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-04T22:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising