ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
ABN, First Publish Date - 2021-10-18T03:43:52+05:30
మండలంలోని పారుపెల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాలకుల చంద్రుకు మంజూరైన రూ.1.25 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఆదివారం ఉమ్మడి జిల్లా ఎంఎల్సీ పురాణం సతీష్కుమార్ బాధితునికి అందించారు.
కోటపల్లి, అక్టోబరు 17: మండలంలోని పారుపెల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాలకుల చంద్రుకు మంజూరైన రూ.1.25 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఆదివారం ఉమ్మడి జిల్లా ఎంఎల్సీ పురాణం సతీష్కుమార్ బాధితునికి అందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సాంబగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడ ప్రభాకర్, సర్పంచు అక్కల మధుకర్, నాయకులు గట్టగౌడ్, కుర్మ భీమగౌడ్, మహేష్ పాల్గొన్నారు.
కాసిపేట: దేవాపూర్కు చెందిన మోరె నారాయణకు మంజూరైన రూ.22 వేల సీఎం సహాయ నిధి చెక్కును ఆదివారం టీఆర్ఎస్ నాయకులు అంద జేశారు. పార్టీ మండల కన్వీనర్ రమణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సహకారంతో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూ రయ్యాయని తెలిపారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ దేవాపూర్ పట్టణాధ్యక్షుడు వడ్లూరి మల్లేష్, నాయకులు గడ్డం పురుషోత్తం, మడావి అనంతరావు, బింగి శ్రీనివాస్, రొడ్డ కిష్టయ్య, కొత్త శ్రావణ్, గోనె రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-18T03:43:52+05:30 IST