చైతన్యంతోనే సమాజంలో మార్పు
ABN, First Publish Date - 2021-12-07T03:52:07+05:30
చైతన్యంతోనే సమాజంలో మార్పు వస్తుందని ప్రజాకవి జయరాజ్, సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ధూంధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజులు పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సింగరేణి కళావేదికలో భారత రాజ్యాంగ పరిరక్షణ-సామాజిక న్యా యం సదస్సుకు వారు హాజరై మాట్లాడారు.
బెల్లంపల్లి, డిసెంబరు 6 : చైతన్యంతోనే సమాజంలో మార్పు వస్తుందని ప్రజాకవి జయరాజ్, సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ధూంధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజులు పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సింగరేణి కళావేదికలో భారత రాజ్యాంగ పరిరక్షణ-సామాజిక న్యా యం సదస్సుకు వారు హాజరై మాట్లాడారు. కమ్యూనిజం ద్వారానే ప్రజలు చైతన్యవంతులవుతారని, అప్పుడే సమ సమాజం ఏర్పడుతుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు కలిసికట్టుగా వెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్ ఉపన్యా సకులు రాజేష్, దేవేందర్, సాంస్కృతిక కార్యదర్శి పల్లె నర్సింహులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శంకర్, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-07T03:52:07+05:30 IST