ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN, First Publish Date - 2021-09-19T04:34:37+05:30
షెడ్యూల్డ్ కుల స్థులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ సంతోష్ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
రెబ్బెన, సెప్టెంబరు 18: షెడ్యూల్డ్ కుల స్థులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ సంతోష్ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మద్యం షాపుల్లో గౌడ కులస్థులు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ నిర్ణయం త్వరలో జరగబోయే మద్యం టెండర్ల నుంచే అమల్లోకి రానుందన్నారు. ఈ మేరకు గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం చొప్పున షాప ులను కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, రాజేష్, భరద్వాజ్, రాజేష్, బయ్య, వస్రం నాయక్, విమలేష్, ఆశన్న, మోహన్, లోకేష్, రజినీకాంత్ పాల్గొన్నారు.
దహెగాం: మండలకేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి శనివారం గౌడకులస్థులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ ఎస్ మండల కన్వీనర్ సంతోష్గౌడ్, దామోదర్గౌడ్, మహేష్గౌడ్, రాజాగౌడ్, నాయకులు ప్రసాద్రాజు, వెంకన్న, పాపన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-19T04:34:37+05:30 IST