హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో వైయో ల్యాప్టాప్స్ విడుదల
ABN, First Publish Date - 2021-01-16T04:00:36+05:30
హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో వైయో ల్యాప్టాప్స్ విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ వైయో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అద్భుత ఫీచర్లతో కొత్త ల్యాప్టాప్లను విడుదల చేసింది. భారత మార్కెట్లో పూర్తి హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేలతో వైయో ఈ15, ఎస్ఈ 14 ల్యాప్టాప్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.
భారత మార్కెట్లో వైయో ఈ15 ల్యాప్టాప్ ప్రారంభ ధర రూ. 66,990 ఉండగా, వైయో ఎస్ఈ 14 ల్యాప్టాప్ ధర రూ. 84,690 లభించనుందని కంపెనీ పేర్కొంది. రెండు వైయో ల్యాప్టాప్లను రెండు విభిన్న రంగుల ఎంపికలలో రూపొందించినట్లు సంస్థ తెలిపింది.
Updated Date - 2021-01-16T04:00:36+05:30 IST