కొత్త ఫీచర్లతో TCL Tablets విడుదల
ABN, First Publish Date - 2021-07-27T01:46:04+05:30
కొత్త ఫీచర్లతో TCL Tablets విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్లో అద్భుత ఫీచర్లతో టీసీఎల్ 10 టాబ్ మ్యాక్స్ 4జీ, టీసీఎల్ 10 టాబ్ మాక్స్ (వై-ఫై), టీసీఎల్ టాబ్ 10 4జీ ఎఫ్హెచ్డీ, మరియు టీసీఎల్ టాబ్ 10 ఎస్ (వై-ఫై) టాబ్లెట్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. టీసీఎల్ టాబ్లెట్ ప్రారంభ ధర రూ.15,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది. టీసీఎల్ టాబ్ 10లను మొదట సీఇఎస్ 2021లో జనవరిలో ప్రవేశపెట్టారు. ఈ టాబ్లెట్ మోడళ్లతో పాటు టీసీఎల్ టాబ్ 10 4జీ ఎఫ్హెచ్డి టాబ్లెట్ ఇప్పుడు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని కంపెనీ తెలిపింది.
Updated Date - 2021-07-27T01:46:04+05:30 IST