JLRలో Tata Motors భారీ పెట్టుబడులు..
ABN, First Publish Date - 2021-07-31T22:47:17+05:30
JLRలో Tata Motors భారీ పెట్టుబడులు..
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమైంది. 2022 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వ్యాపారం కోసం ప్రముఖ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)లో టాటా మోటార్స్ గ్రూప్ రూ. 28,900 కోట్లు పెట్టుబడి పెడుతుందని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ చెప్పినట్లు పీటీఐ నివేదించింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వ్యాపారం కోసం తగిన సమయంలో మూలధనాన్ని ప్రత్యేకంగా సేకరించాలని యోచిస్తోంది. కంపెనీ వర్చువల్ ఏజీఎంని ఉద్దేశించి చైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ కంపెనీ తన అమ్మకాల్లో 25 శాతం మధ్యస్థంగా ఈవీల నుంచి వచ్చేలా చూస్తోందని తెలిపారు.
Updated Date - 2021-07-31T22:47:17+05:30 IST