OnePlus: వన్ప్లస్ స్మార్ట్టీవీలపై ధరల పెంపు
ABN, First Publish Date - 2021-07-17T02:30:11+05:30
OnePlus: వన్ప్లస్ స్మార్ట్టీవీలపై ధరల పెంపు
న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ వన్ప్లస్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. భారత మార్కెట్లో వన్ప్లస్ టీవీలపై ధరలను పెంచుతున్నట్లు సంస్థ పేర్కొంది. వన్ప్లస్ టీవీ యూ1ఎస్ సిరీస్ టీవీపై రూ. 7,000 వరకు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. గత నెలలో విడుదల చేసిన 50 అంగుళాల వన్ప్లస్ టీవీ యూ1ఎస్ సిరీస్ టీవీ ధర రూ. 39,999 ఉండగా, ప్రస్తుతం రూ. 46,999 ఉందని సంస్థ తెలిపింది.
Updated Date - 2021-07-17T02:30:11+05:30 IST