ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2021: తండ్రి జట్టు గెలుపు కోసం తనయ జీవాధోని ప్రార్థన

ABN, First Publish Date - 2021-10-05T16:52:38+05:30

ఐపీఎల్ 2021 లో భాగంగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడియో వైరల్ 

సోషల్ మీడియాలో క్యూటెస్ట్ అంటూ ఫ్యాన్స్ సందేశాలు

దుబాయ్: ఐపీఎల్ 2021 లో భాగంగా సోమవారం రాత్రి  చెన్నై సూపర్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన సాక్షి, జీవాధోనీలు స్టాండులో కూర్చున్నారు.ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ పై తన తండ్రి ఎంఎస్ ధోనీ గెలుపు కోసం అతని కుమార్తె జీవాధోని చేతులు జోడించి దేవుడికి ప్రార్థనలు చేశారు. తల్లి సాక్షి ఒడిలో కూర్చున్న జీవా ధోని కళ్లు మూసుకొని తన తండ్రి ఎంఎస్ ధోనీ జట్టు విజయం కోసం ప్రార్థించారు.


దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2021 పోరులో ఎంఎస్ ధోనీకి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. డ్వేన్ బ్రావో వేసిన చివరి ఓవర్‌లో కెమెరామెన్ ధోనీ కుమార్తె జీవాను చూపించాడు. జీవా ధోని కళ్లుమూసుకొని, చేతులు జోడించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం కోసం ప్రార్థిస్తూ కనిపించింది. మ్యాచ్ సందర్భంగా లైవ్ లో ప్రసారమైన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు జీవా ధోని ప్రార్థనను మెచ్చుకుంటూ సందేశాలు పోస్టు చేశారు. 


Updated Date - 2021-10-05T16:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising