ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

pak జట్టుతో టీమిండియా ఆడకూడదు... బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్వీట్

ABN, First Publish Date - 2021-10-25T16:58:57+05:30

ఉగ్రవాద రాజ్యమైన పాకిస్థాన్ తో మన టీమిండియా జట్టు క్రికెట్ ఆడకూడదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సోమవారం ట్వీట్ చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉగ్రవాద రాజ్యమైన పాకిస్థాన్ తో మన టీమిండియా జట్టు క్రికెట్ ఆడకూడదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సోమవారం ట్వీట్ చేశారు.ప్రతీరోజు అమాయక పౌరులను చంపేస్తున్న దురాక్రమణదారు అయిన పాకిస్థాన్ తో మనం ఆడకూడదని స్వామి పేర్కొన్నారు. బీసీసీఐలో నిర్ణయాధికారికి 2021 సంవత్సరానికి బుద్ధుని బిరుదు ఇవ్వాలని స్వామి ట్వీట్ చేశారు.ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత పలువురు రాజకీయ నాయకులు ట్విట్లు చేశారు. ‘‘గెలుపు ఓటములు అన్నీ ఆటలో భాగం. మీరు పుంజుకొని, ప్రపంచ కప్ గెలవడానికి టీమిండియా కోసం రూటింగ్. రాబోయే మ్యాచ్‌లకు ఆల్ ది బెస్ట్ టీం ఇండియా’’ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రపంచ కప్ ఫైనల్స్ లో టీమిండియా ఫలితాన్ని తిప్పికొడుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-10-25T16:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising