ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌పై పోరుకు విరుష్క విరాళం రూ. 2 కోట్లు

ABN, First Publish Date - 2021-05-08T08:59:36+05:30

కొవిడ్‌-19పై పోరుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జోడీ సై అంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేయూతనివ్వాలని పిలుపు

న్యూఢిల్లీ: కొవిడ్‌-19పై పోరుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జోడీ సై అంది. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రూ. 7 కోట్లు విరాళంగా సేకరించాలని సంకల్పించింది. ఇందుకు తమ వంతుగా రూ. 2 కోట్లను శుక్రవారం ప్రకటించింది. నిధుల సేకరణ ప్లాట్‌ఫామ్‌ ‘కెట్టో’ వేదికగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని విరుష్క జోడీ పిలుపునిచ్చింది. ఏడు రోజులపాటు ఈ విరాళాల సేకరణ ఉద్యమం కొనసాగనుంది. ‘దేశ చరిత్రలోనే మనం తొలిసారి అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో మనమంతా ఒక్కటై సాధ్యమైనంత ఎక్కువమందిని ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవాలి. ఈ బృహత్కార్యంలో అంతా భాగస్వాములు కావాలి’ అని కోహ్లీ పిలుపునిచ్చాడు. 

Updated Date - 2021-05-08T08:59:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising