ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శెభాష్... దేశం గర్వపడేలా చేశారు: టీమిండియాపై వెంకయ్య ప్రశంసలు!

ABN, First Publish Date - 2021-01-20T00:02:27+05:30

బ్రిస్బేన్ టెస్టులో చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్రిస్బేన్ టెస్టులో చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. టీమిండియా దృఢ సంకల్పం, వెన్నుచూపని తత్వం యావత్ దేశం గర్వపడేలా చేసిందంటూ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టులో మూడు వికెట్ల తేడాతో చిరస్మరణీయమైన విజయం అందుకున్న టీమిండియా... 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉపరాష్ట్రతి వెంకయ్య ట్విటర్ వేదికగా స్పందిస్తూ... ‘‘బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకున్న భారత క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఇవాళ మీరు చరిత్ర సృష్టించారు. దృఢమైన మీ సంకల్పం, వెన్నుచూపని తత్వంతో యావద్దేశాన్ని గర్వపడేలా చేశారు. శెభాష్..’’ అని వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-01-20T00:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising