ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారా ఒలింపిక్స్‌లో అవనీ లేఖరాకు బంగారు పతకం

ABN, First Publish Date - 2021-08-30T14:20:58+05:30

టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్ మరో ఘనత సాధించింది. ఈసారి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇండియన్ షూటర్ అవనీ లేఖరా మంచి ప్రదర్శన చూపారు. ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి, భారత్‌కు బంగారు పతకాన్ని అందించారు. ఫైనల్‌లో అవనీ లేఖరా... 249.6 రికార్డు స్కోరుతో బంగారు పతకం దక్కించుకోగా, చైనాకు చెందిన కుయ్‌పింగ్ ఝాంగ్ 248.9 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఉక్రెయిన్‌కి చెందిన ఇరినా షెత్నిక్ 227.5 స్కోరుతో తో కాంస్య పతకం దక్కించుకున్నారు. కాగా పారాఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ దక్కించుకున్న మొదటి భారతీయురాలిగా అవనీ లేఖరా రికార్డ్ నెలకొల్పారు. 

Updated Date - 2021-08-30T14:20:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising