పారా ఒలింపిక్స్లో అవనీ లేఖరాకు బంగారు పతకం
ABN, First Publish Date - 2021-08-30T14:20:58+05:30
టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో...
టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్ మరో ఘనత సాధించింది. ఈసారి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇండియన్ షూటర్ అవనీ లేఖరా మంచి ప్రదర్శన చూపారు. ఫైనల్లో అద్భుత విజయం సాధించి, భారత్కు బంగారు పతకాన్ని అందించారు. ఫైనల్లో అవనీ లేఖరా... 249.6 రికార్డు స్కోరుతో బంగారు పతకం దక్కించుకోగా, చైనాకు చెందిన కుయ్పింగ్ ఝాంగ్ 248.9 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఉక్రెయిన్కి చెందిన ఇరినా షెత్నిక్ 227.5 స్కోరుతో తో కాంస్య పతకం దక్కించుకున్నారు. కాగా పారాఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ దక్కించుకున్న మొదటి భారతీయురాలిగా అవనీ లేఖరా రికార్డ్ నెలకొల్పారు.
Updated Date - 2021-08-30T14:20:58+05:30 IST