Tokyo Olympics : పురుషుల హాకీ సెమీఫైనల్లో భారత్ ఓటమి
ABN, First Publish Date - 2021-08-03T14:47:11+05:30
భారత పురుషుల హాకీ జట్టు అడుగు దూరంలో ఆగిపోయింది. సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ హాకీ టీమ్ చేసిన పోరాటం వృథాగా పోయింది. సెమీస్లో భారత్ పురుషుల హాకీ జట్టు
Tokyo Olympics : భారత పురుషుల హాకీ జట్టు అడుగు దూరంలో ఆగిపోయింది. సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ హాకీ టీమ్ చేసిన పోరాటం వృథాగా పోయింది. సెమీస్లో భారత్ పురుషుల హాకీ జట్టు, వరల్డ్ నెంబర్ వన్ బెల్జియంతో తలపడింది. ఈ మ్యాచ్లో 5-2 తేడాతో బెల్జియం చేతిలో ఇండియా పరాజయం పాలైంది. తొలి క్వార్టర్లోనే రెండు గోల్స్ చేసి సత్తాచాటిన టీమిండియా ఆ తర్వాత పూర్తిగా ఆటపై పట్టుకోల్పోయింది. దీంతో నాలుగో క్వార్టర్లో రెచ్చిపోయిన ప్రత్యర్థి బెల్జియం వరుగా మూడు గోల్స్ చేసింది. చివరకు 5-2 తేడాతో మ్యాచ్ను సొంతం చేసుకున్న బెల్జియం ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక ఈ ఓటమితో భారత్ పసిడి ఆశలు గల్లంతయ్యాయి. కాంస్యం కోసం రెండో సెమీస్లో ఓడిన జట్టుతో గురువారం భారత్ తన తదుపరి మ్యాచ్ ఆడనుంది.
Updated Date - 2021-08-03T14:47:11+05:30 IST