ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోక్యో ఒలంపిక్స్‌కు వెళ్లనున్న జగన్ మోహన్ రావు

ABN, First Publish Date - 2021-06-22T22:10:47+05:30

టోక్యో ఒలంపిక్స్‌కు వెళ్లనున్న జగన్ మోహన్ రావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): జాతీయ హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు భారతదేశం నుంచి విశిష్ట అతిథిగా టొక్యో ఒలింపిక్స్‌కు హాజరవుతున్నారు. టోక్యో వెళ్లే భారత డెలిగేట్స్ బృందంలో జగన్ మోహన్ రావు పేరును భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) చేర్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్‌కు వెళుతున్న ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రావునే కావడం విశేషం.  జగన్‌కు ఈ అవకాశం రావడం పట్ల తెలుగు రాష్ట్రాల క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ మేరకు జగన్ మోహన్ రావుకు ఐవోఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా నుంచి మంగళవారం ఓ లేఖ కూడా వచ్చింది. వచ్చే నెల 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్న ఒలంపిక్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం రావడం పట్ల జగన్ మోహన్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఒలంపిక్స్ నిర్వహణ,  అక్కడ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను పరిశీలించి జపాన్ నుంచి వచ్చాక కేంద్ర రాష్ట్ర క్రీడా శాఖలు, ఐవోఏకు ఒక నివేదిక అందజేస్తానని జగన్మోహన్ రావు తెలిపారు

Updated Date - 2021-06-22T22:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising