ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో తేజకు రజతం

ABN, First Publish Date - 2021-09-02T21:19:33+05:30

జాతీయ స్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో తేజకు రజతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖైరతాబాద్‌ సెప్టెంబర్‌1 (ఆంధ్రజ్యోతి): కష్టపడితే సాధించలేనిది ఏమీ ఉండదని ఖైరతాబాద్‌కు చెందిన సాయి సాయి కృష్ణ తేజ నిరూపించాడు. చదువుతో పాటు కిక్‌ బాక్సింగ్‌లో రాణిస్తూ అటు కుటుంబసభ్యులకు, ఇటు తెలంగాణకు పేరు తెస్తున్నాడు. ఇటీవలే నగరంలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో బంగారు పతకం సాధించిన తేజ వెంటనే గోవాలో జరిగిన నేషనల్‌ కిక్‌ బలాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌-2021లో పాల్గొని రజత పతకం సాధించాడు. చివరి పోరులో తమిళనాడుకు చెందిన ఆటగాడితో కేవలం 2 పాయింట్ల తేడాతో మొదటి స్థానాన్ని కోల్పోయిన తేజ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. ఖైరతాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన చంద్రశేఖర్‌ కుమారుడైన తేజ జాతీయ స్థాయి పతకం సాధించి బుధవారం ఖైరతాబాద్‌కు రాగా రైల్వేగేటు నుండి గాంధీనగర్‌ వరకు ఖైరతాబాద్‌ వాసులు భారీ ఊరేగింపు నిర్వహించి తేజను అభినందించారు. ఎఐసిసి అధికార ప్రతినిధి, కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌, ఖైరతాబాద్‌ కార్పోరేటర్‌ విజయారెడ్డి, మాజీ కార్పోరేటర్‌ ఎస్‌కె షరీఫ్‌, నాయకులు మహేష్‌ యాదవ్‌,మధుకర్‌ యాదవ్‌, వైల ప్రవీణ్‌, కమ్మరి వెంకటేష్‌ ,అంజయ్య, తదితరులు తేజను సత్కరించి అభినందించారు. వచ్చే సంవత్సరం బ్యాంకాక్‌లో జరిగే 6వ ఏషియన్‌ ఇండోర్‌ అండ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీలకు ఎంపికయ్యానని, అందులో పతకం సాధించేందుకు కృషి చేస్తున్నానని సాయి కృష్ణ తేజ తెలిపారు.



Updated Date - 2021-09-02T21:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising