ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రికెటర్‌ కాకుంటే.. ఉగ్రవాది అయ్యేవాడు!

ABN, First Publish Date - 2021-04-07T09:54:55+05:30

ఇంగ్లండ్‌ క్రికెటర్‌, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడైన మొయిన్‌ అలీపై బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను క్రికెటర్‌ కాకపోయుంటే.. కచ్చితంగా ఉగ్రవాది అయ్యుండేవాడని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మొయిన్‌ అలీపై తస్లీమా వివాదాస్పద వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ క్రికెటర్‌, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడైన మొయిన్‌ అలీపై బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను క్రికెటర్‌ కాకపోయుంటే.. కచ్చితంగా ఉగ్రవాది అయ్యుండేవాడని ట్వీట్‌ చేశారు. ఐపీఎల్‌లో చెన్నై జట్టు జెర్సీపై మద్యం కంపెనీ లోగో ఉన్నందున.. దాని స్థానంలో మరో జెర్సీ ధరించేందుకు తనకు అనుమతివ్వాలని మొయిన్‌ అలీ సీఎ్‌సకే యాజమాన్యాన్ని కోరినట్టు రెండ్రోజుల క్రితం వార్తలొచ్చాయి. దీనిపైనే తస్లీమా స్పందిస్తూ.. ‘మొయిన్‌ అలీ క్రికెట్‌లో నిలవలేకుంటే.. కచ్చితంగా సిరియా వెళ్లి ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలో చేరేవాడు’ అని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. తస్లీమా ట్వీట్‌పై నెటిజన్లు, క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. కాగా.. జెర్సీపై లోగోను తొలగించాలంటూ మొయిన్‌ అలీ తమను కోరలేదని చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్‌ స్పష్టం చేశాడు.


Updated Date - 2021-04-07T09:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising