పాక్పై దక్షిణాఫ్రికా విజయం
ABN, First Publish Date - 2021-04-13T09:16:55+05:30
ఓపెనర్ మార్క్రామ్ (54) అర్ధసెంచరీతో, ఆల్రౌండర్ జార్జ్ లిండే (3/23) మూడు కీలక వికెట్లు తీసి సత్తా చాటడంతో రెండో టీ20లో పాకిస్థాన్పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది...
జొహాన్నె్సబర్గ్: ఓపెనర్ మార్క్రామ్ (54) అర్ధసెంచరీతో, ఆల్రౌండర్ జార్జ్ లిండే (3/23) మూడు కీలక వికెట్లు తీసి సత్తా చాటడంతో రెండో టీ20లో పాకిస్థాన్పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. నాలుగు టీ20ల సిరీ్సలో భాగంగా సోమవారం జరిగిన రెండో మ్యాచ్లో పాక్పై ఆతిథ్య జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గి సిరీ్సను 1-1తో సమం చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 14 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ మార్క్రామ్తో పాటు కెప్టెన్ క్లాసెన్ (36 నాటౌట్) రాణించాడు.
Updated Date - 2021-04-13T09:16:55+05:30 IST