సరిత పసిడి పట్టు
ABN, First Publish Date - 2021-04-16T05:58:19+05:30
ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో సరిత మోర్ వరుసగా రెండో ఏడాది పసిడి పతకం కైవసం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 59 కిలోల విభాగం ఫైనల్లో...
- సీమ, పూజాకు కాంస్యాలు
అల్మాటి (కజికిస్థాన్): ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో సరిత మోర్ వరుసగా రెండో ఏడాది పసిడి పతకం కైవసం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 59 కిలోల విభాగం ఫైనల్లో సరిత 10-7తో షూవ్దోర్ బాటర్జావ్ (మంగోలియా)పై నెగ్గి టైటిల్ దక్కించుకుంది. ఒకదశలో 1-7తో ఓటమి అంచుల్లో నిలిచిన సరిత ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇక, ఇదే టోర్నీలో 50 కి. కేటగిరీలో సీమా బిస్లా, 76 కి. విభాగంలో పూజా కాంస్య పతకాలను గెల్చుకున్నారు.
Updated Date - 2021-04-16T05:58:19+05:30 IST