నిలకడగా ఆడుతున్న భారత్.. రోహిత్శర్మ అర్ధ సెంచరీ
ABN, First Publish Date - 2021-09-05T00:14:39+05:30
ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేశాడు. 145 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి నిదానంగా ఆడుతున్న రోహిత్ ఇంగ్లిష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. పుజారా కూడా రోహిత్కు సహకరిస్తూ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి 85 బంతుల్లో 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం వికెట్ నష్టానికి 125 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లండ్ కంటే 26 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ 55, పుజారా 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Updated Date - 2021-09-05T00:14:39+05:30 IST