రోహిత్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన ముంబై
ABN, First Publish Date - 2021-04-18T01:36:02+05:30
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ..
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేసి అవుటయ్యాడు. ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ విజయ్ శంకర్ వేసిన స్లో డెలివరీని అంచనా వేయలేని రోహిత్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద విరాట్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబై ప్రస్తుతం 6.3 ఓవర్లలో 55 పరుగులకు ఓ వికెట్ కోల్పోయింది. క్రీజులో క్వింటన్ డీకాక్(17: 15 బంతుల్లో.. 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్(0) ఉన్నారు.
Updated Date - 2021-04-18T01:36:02+05:30 IST