Tokyo Olympics: వరుస విజయాలతో సింధు దూకుడు..!
ABN, First Publish Date - 2021-07-29T13:18:50+05:30
ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు దూసుకెళ్తోంది. ఇవాళ(గురువారం) జరిగిన రౌండ్ ఆఫ్ 16లో జరిగిన మ్యాచ్లో వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది.
క్వార్టర్ ఫైనల్స్కు చేరిన సింధు
టోక్యో: ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు దూసుకెళ్తోంది. ఇవాళ(గురువారం) రౌండ్ ఆఫ్ 16(ప్రీక్వార్టర్)లో జరిగిన మ్యాచ్లో వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. డెన్మార్క్కు చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ బ్లింక్ ఫెల్ట్పై 21-15, 21-13 తేడాతో గెలిచింది. తొలి రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్లో కూడా సింధు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చింది. దీంతో ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది. మొదటి సెట్ను 21-15 తేడాతో సులువుగా గెలుచుకున్న సింధు, రెండో సెట్ను 21-13 తేడాతో మరింత సునాయాసంగా గెలుచుకుంది. దీంతో మొత్తం 40 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. ఈ గెలుపుతో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. రియో ఒలింపిక్స్లో రజతంతో మెరిసిన సింధు ఈసారి మొదటి మ్యాచ్ నుంచే పతక వేటలో పడింది. మునుముందు కూడా ఈ దూకుడును సింధు ఇలాగే కొనసాగిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరడం ఖాయం.
Updated Date - 2021-07-29T13:18:50+05:30 IST