కేకేఆర్ జట్టులో మరో ఆటగాడికి కరోనా!
ABN, First Publish Date - 2021-05-08T21:17:25+05:30
భారత్ను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఐపీఎల్ను సజావుగా సాగనివ్వలేదు.
భారత్ను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఐపీఎల్ను సజావుగా సాగనివ్వలేదు. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, బయోబబుల్లో ఉంచినప్పటికీ ఈ మహమ్మారి వైరస్ ఆటగాళ్లను వదల్లేదు. దీంతో ఐపీఎల్ను అర్ధంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. కోల్కతా నైట్రైడర్స్ టీమ్కు చెందిన మరో ఆటగాడు తాజాగా కరోనా బారిన పడ్డాడు.
టీమిండియా ఆటగాడు, కేకేఆర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు తాజాగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో కేకేఆర్ జట్టులో వైరస్ సోకిన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ కరోనా బారినపడ్డారు. కాగా, ఇంగ్లండ్లో జరుగనున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్, ఐదు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ప్రసిద్ధ్ కృష్ణ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Updated Date - 2021-05-08T21:17:25+05:30 IST