ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తయిన ఐపీఎల్‌ మ్యాచ్‌లకే చెల్లించండి

ABN, First Publish Date - 2021-05-10T09:27:32+05:30

కరోనా కారణంగా ఐపీఎల్‌ వాయిదా పడడంతో అటు స్టార్‌ గ్రూప్‌ కూడా తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలకు అండగా నిలిచింది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లకు మాత్రమే చెల్లింపులు చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఐపీఎల్‌ వాయిదా పడడంతో అటు స్టార్‌ గ్రూప్‌ కూడా తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలకు అండగా నిలిచింది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లకు మాత్రమే చెల్లింపులు చేయాలని కోరింది. 2018-2022 వరకు ఐపీఎల్‌ టీవీ, డిజిటల్‌ హక్కులను స్టార్‌ గ్రూప్‌ రూ.16,346 కోట్లకు దక్కించుకుంది. అంటే 60 మ్యాచ్‌లకు గాను ఒక్కో మ్యాచ్‌కు రూ.54.5 కోట్లు బోర్డుకు చెల్లించనుంది. కరోనా కారణంగా లీగ్‌ వాయిదా పడగా ఇప్పటికి 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇంకా 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉండడంతో స్పాన్సర్లు, ప్రకటనకర్తలు భారీగానే నష్టపోనున్నారు. అందుకే మొత్తంగా కాకుండా పూర్తయిన మ్యాచ్‌లకే డబ్బులు చెల్లించాలని స్టార్‌ గ్రూప్‌ వారికి తెలిపింది. ఈసారి టీవీ వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. 2020లో 349 మిలియన్ల మంది వీక్షించగా ఈసారి ఆ సంఖ్య 352 మిలియన్లకు చేరడం విశేషం.

Updated Date - 2021-05-10T09:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising