ఆంధ్రకు ఊరట విజయం
ABN, First Publish Date - 2021-01-18T09:46:50+05:30
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హ్యాట్రిక్ ఓటములతో నాకౌట్కు దూరమైన ఆంధ్రా జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది.
ముంబై: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హ్యాట్రిక్ ఓటములతో నాకౌట్కు దూరమైన ఆంధ్రా జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఆదివారం జరిగిన గ్రూప్-ఈ మ్యాచ్లో రాయుడు సేన 6 వికెట్లతో కేరళపై నెగ్గింది. తొలుత కేరళ 20 ఓవర్లలో 112/4 స్కోరు చేసింది. సచిన్ బేబి (51 నాటౌట్) అర్ధ సెంచరీ సాధించాడు. మనీష్ 2, షోయబ్ ఖాన్, లలిత్ మోహన్ చెరో వికెట్ తీశాడు. ఛేదనలో అశ్విన్ హెబ్బర్ (48), అంబటి రాయుడు (38 నాటౌట్) రాణించడంతో ఆంధ్ర 17.1 ఓవర్లలో 113/4 స్కోరు చేసి గెలిచింది.
Updated Date - 2021-01-18T09:46:50+05:30 IST